తెలంగాణ రాష్ట్ర బీజేపీకి ఊహించని షాక్ తగిలిందని చెప్పాలి. ఇక హైదరాబాద్లోని బీజేపీ ఆఫీస్ ముట్టడికి గిరిజన సంఘాలు ట్రై చేశాయి. భారీగా తరలి వచ్చిన గిరిజనులు ఆఫీసుని ముట్టడించి చేసే ప్రయత్నం చేశారు.గిరిజన రిజర్వేషన్లపై కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా గిరిజనులు బీజేపీ పార్టీ రాష్ట్ర కార్యాలయాన్ని ముట్టడించేందుకు  ప్రయత్నం చేశారు. అయితే వెంటనే వీరిని అడ్డుకుని పోలీసులు అరెస్టు చేశారు. గిరిజనులకు… వ్యతిరేకంగా బీజేపీ పార్టీ నాయకులు కూడా తగాదాకి దిగారు.గిరిజనులంతా కూడా టిఆర్ఎస్ పార్టీ నాయకులు అంటూ బీజేపీ నాయకులు ఫైర్ అయ్యారు.


కేసిఆర్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు కూడా చేశారు. అయితే ఇక వాళ్ల పార్లమెంట్లో కేంద్రమంత్రి st రిజర్వేషన్లపై వివాదాస్పద కామెంట్స్ కూడా చేశారు.ST వారికి రిజర్వేషన్లు కల్పించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి డిమాండ్లు రాలేదని ఆయన పార్లమెంటు వేదికగా ప్రకటించారు.ఇక టీఆర్ఎస్ ఎంపీలు తాము 2017 వ సంవత్సరంలోనే ఎస్టీ రిజర్వేషన్ పెంచాలని అసెంబ్లీ ద్వారా పంపామని నిరసనకు దిగారు. ఇక ఈ నేపథ్యంలోనే హైదరాబాద్లో గిరిజన సంఘాలు bjp రాష్ట్ర కార్యాలయాన్ని ముట్టడించేందుకు ట్రై చేశాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

BJP