మోడీ పై పోరాటానికి ముఖ్యమంత్రులు సిద్దం అవుతున్నారు. బీజేపీయేతర సీఎంలు ఇందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. ఇప్పటికే బీజేపీపై పోరాటానికి విపక్ష పార్టీలు ఏకం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీయేతర ముఖ్యమంత్రుల సమావేశం త్వరలో జరగబోతోంది. ఈ సీఎంలు ఎవరెవరు.. ఎక్కడ భేటీ అవుతారు.. అనే అంశాలపై అనేక ఊహాగానాలు సాగుతున్నాయి. ఈ భేటీ  త్వరలోనే ముంబయిలో ఈ భేటీ జరిగే అవకాశం ఉందని శివసేన నేత సంజయ్ రౌత్ చెబుతున్నారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితి గురించి వీరు చర్చిస్తారట. ఇప్పటికే ఎన్సీపీ అధినేత శరద్ పవార్ , మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్థవ్ ఠాక్రే ఈ అంశంపై చర్చించారట. ఈ భేటీ గురించి ప్రయత్నాలు కొనసాగుతుంటాయని వారు చెబుతున్నారు. ఈ భేటీ అవసరం ఏంటో చెబుతూ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇటీవలే బీజేపీయేతర సీఎంలకు లేఖ రాసిన సంగతి తెలిసిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: