ఇవాళ హైదరాబాద్‌లో టీఆర్ఎస్‌ ప్లీనరీ జరుగుతోంది. పార్టీ 21వ ఆవిర్భావ వేడుకలు హైదరాబాద్ హైటెక్స్‌లో జరుగుతున్నాయి. ఈ కార్యక్రమం కారణంగా ఇవాళ హైదరాబాద్ ట్రాఫిక్‌ పోలీసులు కొన్ని సూచనలు చేశారు. ప్లీనరీ సందర్భంగా హైదరాబాద్  ట్రాఫిక్ పోలీసులు ఆంక్షలు విధించారు. అనేక మార్గాల్లోని కార్యాలయాలకు వెళ్లే వారికి  ట్రాఫిక్‌ పోలీసుల కొన్ని సూచనలు చేశారు. ప్రత్యేకించి హైటెక్స్-కొత్తగూడ మార్గాల్లో వెళ్లేవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. సైబర్ టవర్స్-ఐకియా రోటరీ మార్గాల్లో వెళ్లేవారు.. గచ్చిబౌలి నుంచి కొత్తగూడలోని కార్యాలయాలకు వెళ్లే వారు ముందుగా ప్రిపేర్ అవ్వాలి. అలాగే నీరూస్ జంక్షన్ నుంచి గచ్చిబౌలి వెళ్లే వాహనాలు దారి మళ్లిస్తారు. వారు అయ్యప్ప సొసైటీ, దుర్గం చెరువు, ఐకియా మీదుగా వెళ్లాలి. మియాపూర్, కొత్తగూడ, హఫీజ్‌పేట నుంచి వెళ్లేవారు సైబర్ టవర్స్, ఏఐజీ, ఐకియా,దుర్గం చెరువు మీదుగా వెళ్లాలి. ఆర్సీపురం, చందానగర్ నుంచి మాదాపూర్, గచ్చిబౌలి వెళ్లే వారు బీహెచ్‌ఈఎల్, నల్లగండ్ల, హెచ్‌సీయూ మీదుగా వెళ్లాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: