ఇవాళ ప్రధాన మంత్రి వివిధ రాష్ట్రాల సీఎంలతో భేటీ కాబోతున్నారు. గత కొన్ని రోజులుగా దేశంలో  పెరుగుతున్న కొవిడ్‌ కేసుల కట్టడికి అన్ని రాష్ట్రాల  సీఎంలతో ప్రధాని మోదీ ఇవాళ సమీక్షించనున్నారు . వీడియో కాన్ఫరెన్స్‌లో జరిగే ఈ కార్యక్రమంలో వైరస్‌ కట్టడికి రాష్ట్రాలు తీసుకుంటున్న చర్యలపై చర్చిస్తారు.. రాష్ట్రాలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ముఖ్యమంత్రులతో...  మోదీ చర్చిస్తారు. ప్రస్తుత  కరోనా పరిస్థితులపై కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేష్‌ భూషణ్‌ పవర్‌పాయింట్‌ ప్రెజెంటేషన్‌ ఇస్తారు. ఆయా రాష్ట్రాల్లో నెలకొన్న పరిస్థితులను ముఖ్యమంత్రులు కూడా ప్రధానికి వివరిస్తారు. మే నెలలో పండుగలు ఉన్నందున ప్రతి ఒక్కరూ మాస్కులు,  భౌతికదూరం వంటి కొవిడ్‌ నిబంధనలు పాటించాలని ఇప్పటికే ప్రధాని మన్‌కీ బాత్‌లో దేశ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఓవైపు చైనా వంటి దేశాల్లో లాక్‌డౌన్లు పెడుతున్నారు. ఇటు ఇండియాలోనూ రోజులు కేసులు పెరుగుతున్నాయి. అందుకే జాగ్రత్త పడాల్సిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: