ముఖ్యమంత్రి, వీఐపీల కాన్వాయ్ బిల్లుల పై రాష్ట్ర ప్రభుత్వానికి రవాణా శాఖ రాసిన లేఖ కలకలం సృష్టిస్తోంది. మూడేళ్లుగా పేరుకుపోయిన పాత బకాయిలు 17.5 కోట్ల రూపాయలు వెంటనే చెల్లించకపోతే.. ముఖ్యమంత్రి, ఇతర ముఖ్యనేతల జిల్లాల పర్యటనలకు వాహనాలు సమకూర్చలేమని రవాణా శాఖ అధికారులు తేల్చి చెప్పేసారు. రవాణా మంత్రి  నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఈ అంశాన్ని మంత్రి దృష్టికి అధికారులు తెచ్చారు. ఒంగోలు లాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే బకాయిలు తీర్చాలని చెప్పారు.

ఏపీలో ముఖ్యమంత్రి జిల్లాల పర్యటనలు త్వరలోనే ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో కాన్వాయ్ వాహనాల ఏర్పాటు కోసం తక్షణం బిల్లులు చెల్లించాలని రవాణా శాఖ స్పష్టం చేసిందట. వీఐపీల కాన్వాయ్ ల కోసం ఏటా కనీసం 4.5 కోట్ల రూపాయలు అవసరమని రవాణా అధికారులు అంచనా వేశారు. ఈ మేరకు బడ్జెట్ కేటాయించి, ప్రత్యేక ఖాతా ద్వారా వాహనాల బిల్లులు చెల్లించాలని ప్రభుత్వానికి రవాణా శాఖ లేఖ రాసింది.


మరింత సమాచారం తెలుసుకోండి: