సీఎం జగన్ జోరు పెంచేశారు. క్రమంగా జిల్లాల బాట పడుతున్నారు. గతంలో ఎలాంటి నగదు బదిలీ ఉన్నా తాడేపల్లి కార్యాలయం నుంచి బటన్ నొక్కి డబ్బులు వేసేసేవారు.. కానీ ఇప్పుడు ఈ కార్యక్రమాలు కూడా జిల్లాల్లోనే ఏర్పాటు చేస్తున్నారు. మొన్న ఏలూరు జిల్లా.. ఇవాళ గోదావరి జిల్లాలు.. రేపు కర్నూలు జిల్లా.. ఇలా క్రమంగా సీఎం జగన్ జిల్లాల బాటపడుతున్నారు. సీఎం వైయ‌స్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి రేపు కర్నూలు జిల్లాకు రాబోతున్నారు.


ఓర్వకల్లు మండలం బ్రాహ్మణపల్లి మజరా గ్రామం గుమ్మటం తండాలో సీఎం జగన్ రేపు  పర్యటించనున్నారు. ఇక్కడ రూ.15 వేల కోట్ల పెట్టుబడితో 5,410 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పాదనే లక్ష్యంగా గ్రీన్‌కో ఎనర్జీస్‌ లిమిటెడ్‌ ప్రాజెక్టు చేపడుతోంది. ఈ ప్రాజెక్టుకు సీఎం జగన్ శంకుస్థాపన చేయనున్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు. సీఎం పర్యటన కోసం జిల్లా అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: