ఇవాళ సీఎం జగన్ కర్నూలు జిల్లాలో పర్యటిస్తారు. కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం బ్రాహ్మణపల్లి మజరా గ్రామం గుమ్మటం తండాలో సీఎం జగన్  పర్యటించబోతున్నారు. మరి అక్కడ ఏం కార్యక్రమం ఉంది అంటారా.. ఇక్కడ గ్రీన్‌కో ఎనర్జీస్‌ లిమిటెడ్‌ సంస్థ విద్యుదుత్పత్తి ప్లాంట్ ఏర్పాటు చేయబోతోంది. ఈ గ్రీన్‌కో ఎనర్జీస్‌ లిమిటెడ్‌ సంస్థ ఈ ప్రాజెక్టు కోసం రూ.15 వేల కోట్ల పెట్టుబడి పెట్టబోతోంది.


ఈ ప్రాజెక్టు ద్వారా 5,410 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పాదనే చేయాలని గ్రీన్‌కో ఎనర్జీస్‌ లిమిటెడ్‌ లక్ష్యంగా పెట్టుకుంది. కర్నూలు జిల్లాలోని ఈ ప్రాజెక్టు సీఎం జగన్ ఇవాళ శంకుస్థాపన చేస్తారు. ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు ఈ విషయం ప్రకటించారు.  సీఎం జగన్ పర్యటన కోసం జిల్లా అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇటీవలి కాలంలో సీఎం జగన్ జిల్లాల పర్యటనలు బాగా పెంచేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: