ఇక ప్రపంచ వ్యాప్తంగా జరిగే ప్రపంచ బాక్సింగ్ చాంపియన్షిప్ ఫైనల్స్లో మన ఇండియాకు స్వర్ణం దక్కింది. ఇది నిజంగా మనకు గర్వకారణమే. ఇక ఈ పోటీలో పాల్గొన్న నిఖత్ జరీన్ గోల్డెన్ పంచ్ విసిరి భారత్కు బంగారు పతకం తెచ్చిపెట్టి దేశం మొత్తం కూడా గర్వించేలా చేసింది. ప్రపంచ వ్యాప్తంగా కూడా జరిగే ఈ ప్రపంచ బాక్సింగ్ చాంపియన్షిప్ ఫైనల్స్లో 52 కిలోల విభాగంలో నిఖత్ తన ప్రతాపాన్ని చూపింది. దుమ్ము రేపిన తెలుగు తెలంగాణ బిడ్డగా ఆమె పేరు తెచ్చుకుంది. 


ఇక ఫైనల్‌లో థాయ్ బాక్సర్ జిట్‌పాంగ్‌పై నెగ్గి ఆమె చాంపియన్గా నిలిచింది. కాగా ఈ పోటీల సందర్భంగా అల్లీపురం వేంకటేశ్వర్‌రెడ్డి సంబురంగా కనిపించారు. తెలంగాణ క్రీడాకారణి వరల్డ్ చాంపియన్‌గా నిలవడంతో చాలా హర్షం వ్యక్తం చేశారు.ఇది నిజంగా తెలంగాణ రాష్ట్రానికి ఇంకా అలాగే దేశానికి కూడా చాలా గర్వ కారణమని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: