ఆర్కే రోజా మంత్రి పదవి వచ్చాక జోరు పెంచేశారు. టీడీపీ పై విమర్శల దూకుడు పెంచారు. ఇటీవల ఆమె సొంత జిల్లాలో చంద్రబాబు పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో ఆమె చంద్రబాబును ఓ రేంజ్‌లో విమర్శించారు. రాయలసీమ పర్యటనలో చంద్రబాబు చేసిన విమర్శలు హస్యాస్పదమన్నారు. కావాలంటే.. కుప్పంలో జరిగిన అభివృద్ది, పులివెందులలో జరిగిన అభివృద్దిని పరిశీలించాలని మంత్రి రోజా సూచించారు. 14 సంవత్సారాలు సీఎంగా వున్నా చంద్రబాబు కుప్పం నియోజకవర్గాన్ని కనీసం రెవెన్యూ డివిజన్‌గా కూడా చేసుకోలేని  అసమర్థుడు అంటూ మంత్రి ఆర్కే రోజా ఫైర్‌ అయ్యారు. అధికార పక్షం వాళ్లం.. మేం ప్రజల్లో ధైర్యంగా తిరుగుతుంటే.. వాళ్లు విపక్షం వాళ్లు మీడియా ముందు డ్యాన్సులు వేస్తున్నారు అంటూ రోజా విమర్శించారు. అందుకే వచ్చే ఎన్నికల్లో క్విట్‌ చంద్రబాబు సేవ్ ఆంధ్రప్రదేశ్ నినాదంతో జనంలోకి వెళ్తామంటున్నారు. 2024 ఎన్నికల్లో ఇదే నినాదం వినిపిస్తామంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: