బీజేపీ తెలంగాణపై ఫోకస్ పెట్టింది. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా సత్తా చాటాలని టార్గెట్ పెట్టుకుంది. అందుకే తెలంగాణకు అంత ఇంపార్టెన్స్ ఇస్తోంది. తాజాగా తెలంగాణ నేతలకు ఏకంగా మోదీ ఓ బంపర్ ఆఫర్ ఇచ్చారు. దిల్లీకి బీజేపీ జీహెచ్ఎంసీ కార్పొరేటర్లను పిలిపించుకుంటున్నారు. జీహెచ్‌ఎంసీ బీజేపీ కార్పొరేటర్లకు అపాయింట్ మెంట్ ఇచ్చిన ప్రధాని మోదీ.. రేపు సాయంత్రం నాలుగు గంటలకు వారిని కలవబోతున్నారు. కార్పొరేటర్లను ప్రధానితో కల్పిస్తానని గతంలో బండి సంజ్‌ హామీ కూడా ఇచ్చారు. ఇప్పుడు మోదీ దాన్ని తీరుస్తున్నారు. తెలంగాణపై డిల్లీ పెద్దలు దృష్టి పెట్టారని చెప్పేందుకు ఇది మరో ఉదాహరణ అంటున్నారు బీజేపీ రాష్ట్ర నేతలు. ఇక   ప్రధానిని కలిసే వారిలో గ్రేటర్ పరిధిలోని రాష్ట్ర పదాధికారులు కూడా ఉన్నారు. రాష్ట్ర రాజకీయాలు, తెలంగాణలో అధికారంలోకి వచ్చేందుకు చేయాల్సిన పనులపై ప్రధాని ఈ నేతలకు మార్గ నిర్దేశం చేసే అవకాశం ఉంది. కార్పొరేటర్లతో పాటు ప్రధానిని కలిసే వారిలో గ్రేటర్ పరిధిలోని జిల్లాల అధ్యక్షులు కూడా ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: