ఏపీలో బీజేపీ అభివృద్ధి కోసం కేంద్రంలోని పెద్దలు మోడీ, అమిత్‌ షా బాగానే ప్లాన్ చేస్తున్నట్టున్నారు. ఏపీకి ఇటీవల వరుసగా కేంద్ర మంత్రులు వచ్చి పర్యటిస్తున్నారు. ఇటీవల  కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వచ్చి రెండు, మూడు రోజులు పర్యటించారు. ఇక ఇప్పుడు కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్ పర్యటిస్తున్నారు. ఆయన అనకాపల్లి జిల్లాలో పర్యటించారు. 8 ఏళ్ల భాజపా పాలనలో అన్ని వర్గాలకు సంక్షేమ పథకాల అందించిందని తన పర్యటనలో వ్యాఖ్యానించిన  జైశంకర్‌.. ప్రపంచమే భారత్‌ వైపు చూసేలా మోదీ పాలన చేసిందంటూ పార్టీ భజన ప్రారంభించారు.


కేంద్ర సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలన్న జైశంకర్‌.. అన్ని రాష్ట్రాల్లో కుటుంబపాలన అంతమే భాజపా ధ్యేయమంటున్నారు. ఏపీలో భాజపా గద్దెనెక్కడమే ధ్యేయంగా పనిచేయాలని.. ఏపీ రాష్ట్రాన్ని జగన్‌ మద్యం మాఫియాగా మార్చారని ఆయన ఆరోపించారు. ప్రధాని మోదీ పాలనపై ఎక్కడైనా చర్చకు సిద్ధమన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: