మాజీ ఎంపీ హర్షకుమార్‌ ఏపీ సీఎం జగన్‌కు ఓ బ్రహ్మాండమైన అయిడియా ఇచ్చారు. ఇప్పుడు రాష్ట్రపతి ఎన్నిక కోసం నోటిఫికేషన్ వచ్చింది. ఈ ఎన్నికల్లో బీజేపీ తన అభ్యర్థిని గెలిపించుకోవాలంటే అందుకు వైసీపీ సాయం చాలా అవసరం అవుతుంది. వైసీపీకి 151 ఎమ్మెల్యే సీట్లు 22 ఎంపీ సీట్లు ఉన్నాయి. రాష్ట్ర పతి ఎన్నికకు ఇవి చాలా అవసరం.. అందుకే.. రాష్ట్రపతి ఎన్నిక వైకాపా చేతిలోనే ఉందని.. దాన్ని సరిగ్గా వినియోగించుకోవాలని మాజీ ఎంపీ హర్ష కుమార్‌ సూచిస్తున్నారు.

ఇదే అదనుగా ఏపీ సీఎం జగన్.. రాష్ట్రానికి ఇచ్చిన హామీల అమలుకు పట్టుబట్టాలని హర్ష కుమార్‌ సూచిస్తున్నారు. కానీ సీఎం జగన్ తన కేసుల గురించి భయపడితే మాత్రం రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరుగుతుందని హర్ష కుమార్‌ హెచ్చరిస్తున్నారు. రాజమండ్రిలో సెప్టెంబర్ 25న ఎస్సీ సింహ గర్జన నిర్వహిస్తామని హర్ష కుమార్‌ తెలిపారు.  మైనారిటీలను కలుపుకొని ఎస్సీ సింహ గర్జనకు వెళ్తామని హర్ష కుమార్‌ అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: