ఏపీ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజని మరోసారి సందడి చేశారు. ఆమె తరచూ వార్తల్లో కనిపించే చురుకైన మంత్రి.. తాజగా ఆమె పల్నాడు జిల్లా నాదెండ్లలో నిర్వహించిన ఏరువాక కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని ఏరువాక కార్యక్రమంలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆ తర్వాత మంత్రి రజిని ట్రాక్టర్ నడిపి దుక్కి దున్నారు. ఎద్దులను అదలించి ఏరువాక సాగించారు. ఏరువాక సందర్భంగా నాదెండ్లలో మంత్రి రాకతో కోలాహల వాతావరణం నెలకొంది. అధికారులు, ప్రజా ప్రతినిధులు మంత్రి రజనికి ఘనంగా  స్వాగతం పలికారు. కొద్దిసేపు ట్రాక్టర్ నడిపిన విడదల రజని..  పాడిపంటలతో ప్రజలు సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు.


రైతుల కోసం జగన్ సర్కారు ఎన్నో మంచి పథకాలు అమలు చేస్తోందని మంత్రి విడదల రజని ఈ సందర్భంగా రైతులకు గుర్తు చేశారు. ఆర్బీకేల ఏర్పాటు దేశ రైతు చరిత్రలోనూ గతంలో ఏ నాయకుడూ చేయని ప్రయత్నం అంటూ మెచ్చుకున్నారు మంత్రి విడదల రజని.

మరింత సమాచారం తెలుసుకోండి: