ఏపీలో ఎన్నికల మూడ్ వచ్చేసింది. నిన్న అనకాపల్లి జిల్లాలో మినీ మహానాడు నిర్వహించిన చంద్రబాబు ఇవాళ కూడా అనకాపల్లి జిల్లాలో రెండో రోజు పర్యటించనున్నారు. ఇవాళ  అనకాపల్లి పార్లమెంటు పరిధి నేతలు, కార్యకర్తలతో ఆత్మీయి సమావేశం నిర్వహించనున్నారు. రేపు ప్రజా సమస్యలు, ప్రభుత్వ 'బాదుడే బాదుడు'పై రోడ్ షోలు నిర్వహిస్తారు. ఈ ఏడాదిపాటు వందకు పైగా నియోజకవర్గాల్లో చంద్రబాబు పర్యటించాలని టార్గెట్ గా పెట్టుకున్నారు.


ఇటు జగన్ కూడా వైసీపీపై దృష్టి సారించారు. రేపు వైఎస్ఆర్ జిల్లాలో సీఎం జగన్‌ పర్యటించనున్నారు. పులివెందుల, ప్రొద్దుటూరులో పర్యటిస్తారు. రేపు ఉదయం ప్రొద్దుటూరు నేతలతో, రేపు మధ్యాహ్నం పులివెందులలో నియోజకవర్గస్థాయి నేతలతో  సీఎం జగన్ సమీక్ష నిర్వహిస్తారు. పార్టీ పరిణామాలపై చర్చిస్తారు. రేపు సాయంత్రం తిరిగి కడప నుంచి తాడేపల్లి చేరుకుంటారు. మొత్తానికి ఇద్దరు నేతలు రాజకీయాల్లో ఫుల్‌ బిజీ అన్నమాట.

మరింత సమాచారం తెలుసుకోండి: