ఏపీ సీఎం జగన్ మరోసారి విదేశీ పర్యటనకు రెడీ అవుతున్నారు. ఈ 28 ఏపీ సీఎం జగన్ పారిస్  వెళ్లనున్నారు. ఈసారి వ్యక్తిగత పర్యటన నిమిత్తం ఏపీ సీఎం జగన్ పారిస్ వెళ్లనున్నారు. సీఎం జగన్ పెద్ద కుమార్తె పారిస్ లో మాస్టర్స్ డిగ్రీ చేస్తున్న సంగతి తెలిసిందే. పారిస్ లోని ఇన్సీడ్ బిజినెస్ స్కూల్లో సీఎం జగన్ పెద్ద కుమార్తె హర్ష రెడ్డి చదువుకుంటున్నారు. వచ్చే నెల 2న బిజినెస్ స్కూల్లో కాన్వొకేషన్ ఉంది. కుమార్తె కాన్వొకేషన్ కార్యక్రమానికి హాజరయ్యేందుకు సీఎం వైఎస్ జగన్ పారిస్‌ వెళ్లబోతున్నారు. ఇటీవలే సీఎం జగన్ దావోస్ పర్యటన కోసం విదేశాలకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో ఆయన లండన్‌లో దిగడం కూడా వివాదాస్పదం అయ్యింది. అయితే తాజా పర్యటన  పూర్తిగా వ్యక్తిగతం కావడం వల్ల వివాదాలకు ఆస్కారం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: