కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ పర్సనల్ అసిస్టెంట్ అయిన పీపీ మాధవన్‌పై రేప్ కేసు నమోదైంది. ఈ మేరకు ఢిల్లీ పోలీసులు దీని గురించి ఓ ప్రకటనలో పేర్కొన్నారు.ఇక ఢిల్లీలోని ఉత్తమ్ నగర్ పోలీసు స్టేషన్‌లో ఐపీసీలోని సెక్షన్‌లు 376, 506 కింద కేసు నమోదు చేసినట్టు పోలీసులు వివరించారు.జూన్ 25 వ తేదీన పోలీసులకు అందిన ఓ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. ఈ పీపీ మాధవన్ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి పర్సనల్ సెక్రెటరీగా పని చేస్తున్నట్టు సమాచారం.ఇక ఈ కేసుపై సోనియా గాంధీ పీఏ మాధవన్ స్పందించాడు.


ఇవన్నీ నిరాధారమైన కేసులు అని, ఇది తనపై పన్నిన కుట్ర అని ఆయన కొట్టిపారేశారు.కొన్ని మీడియా కథనాల ప్రకారం తెలిసిన విషయం ఏమిటంటే పీపీ మాధవన్ ఓ దళిత మహిళపై లైంగికదాడికి పాల్పడ్డాడు. జాబ్ ఇంటర్వ్యూ అని, తరువాత ఆమెను పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చి ఈ అఘాయిత్యానికి పాల్పడినట్టు ఆ కథనాలు పేర్కొన్నాయి. ఇక ఆ దళిత మహళ భర్త గతంలోనే మరణించాడు. 2020 వ సంవత్సరంలో ఆయన మరణించే వరకు ఢిల్లీ కాంగ్రెస్ హెడ్‌క్వార్టర్స్‌లలో లేబర్‌గా పని చేసేవాడని తెలిసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: