మాజీ ప్రధాని పీవీ నరసింహారావు తెలుగు తేజం.. ప్రత్యేకించి తెలంగాణ వారు గర్వపడేస్థాయి నాయకుడు. దక్షిణాది నుంచి ఐదేళ్లు దేశాన్ని పాలించిన ఏకైక నాయకుడు. అలాంటి వ్యక్తి జయంతి రోజు తెలంగాణ సీఎం కేసీఆర్‌ నివాళులు అర్పించారు. ఈ మేరకు పత్రిక ప్రకటన విడుదల చేశారు. అయితే.. దీనిపై టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ రేవంత్ రెడ్డి చురకలు వేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు.

వంగి వంగి నమస్కారాలేనా...?!
“వంగర” కి ఏమన్నా చేసేది ఉందా...?!

వంగర ను అధ్బుతమైన పర్యాటక కేంద్రంగా చేస్తాం అని హమీ ఇచ్చి పీవీ శతజయంతి ఉత్సవాలు పూర్తయి ఏడాది అయినా అతిగతి లేదు…!! అంటూ పోస్టు ద్వారా నిలదీశారు. వంగర పీవి నరసింహారావు గారి స్వగ్రామం. ఆ గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చి కూడా ఏమీ చేయలేదని రేవంత్ రెడ్డి చురకలు వేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

kcr