టీడీపీ అధినేత చంద్రబాబును సినీ నటుడు రాజ్ కుమార్ కలిశారు. పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో చంద్రబాబును సినీ నటుడు రాజ్ కుమార్ కలిశారు. చంద్రబాబు ను మర్యాద పూర్వకంగా కలిశానని సినీ నటుడు రాజ్ కుమార్ తెలిపారు. 1996 నుంచి తెలుగుదేశం తరుపున ప్రచారం చేస్తున్నానన్న సినీ నటుడు రాజ్ కుమార్.. 2024 లో అధికారం లోకి వచ్చేది చంద్రబాబేనని ధీమా వ్యక్తం చేశారు.


ప్రజలు జరుగుతున్న పరిణామాలను నిశ్శబ్దం గా పరిశీలిస్తున్నారని..సినీ నటుడు రాజ్ కుమార్ కామెంట్ చేశారు. ప్రస్తుతం తెలుగు లో రెండు సీరియల్స్ చేస్తున్నానని సినీ నటుడు రాజ్ కుమార్ వివరించారు. అయితే.. రాజ్‌కుమార్‌ లో చిరంజీవి పోలికలు చాలా బాగా ఉంటాయి. అందుకే అప్పట్లో ఆయన్ను చిరంజీవికి డూప్‌ గా వాడేవారు. అలాగే ఆయన స్వయంగా హీరోగా కొన్ని సినిమాలు కూడా చేశారు. కానీ అంతగా సక్సస్ కాలేదు. ఆ తర్వాత బుల్లితెరకు వెళ్లి అక్కడ సక్సస్ అయ్యారు రాజ్ కుమార్.


మరింత సమాచారం తెలుసుకోండి: