ఏపీలో ప్రధాని మోడీ పర్యటన రాజకీయంగా కలకలం సృష్టిస్తోంది. భీమవరంలో అల్లూరి సీతారామరాజు కాంస్య విగ్రహం ఆవిష్కరించేందుకు ప్రధాని మోదీ ఏపీ వచ్చారు. అయితే.. ఈ పర్యటనకు పంపిన ఆహ్వానాలు విమర్శలకు, వివాదాలకు తావిస్తున్నాయి. ప్రధాని కార్యక్రమానికి హాజరు కావాలని మెగాస్టార్ చిరంజీవికి ఆహ్వానం అందింది. స్వయంగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఈ ఆహ్వానం పంపారు.


అయితే.. ఈ కార్యక్రమానికి జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు మాత్రం ఆహ్వానం రాలేదు. ఓవైపు బీజేపీతో పొత్తు ఉన్న జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు ఆహ్వానం రాకపోగా.. కాంగ్రెస్‌ నేతగా మారి.. ఆ తర్వాత రాజకీయాలకు దూరంగా ఉన్న చిరంజీవికి ఆహ్వానం అందడం.. దాన్ని మన్నించి ఆయన కార్యక్రమానికి హాజరుకావడం మెగా ఫ్యాన్స్‌లో కలకలం సృష్టిస్తోంది. పవన్ కల్యాణ్‌కు ఆహ్వానం లేకపోవడంపై ఆయన ఫ్యాన్స్ ఆగ్రహంగా ఉన్నారు. మరి ఈ బీజేపీ రాజకీయాల వెనుక అసలు మతలబు ఏంటో..?


మరింత సమాచారం తెలుసుకోండి: