వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు చాలా కాలంగా జగన్‌కు వ్యతిరేకంగా మారిన సంగతి తెలిసిందే. అయితే కొన్నాళ్లుగా వైసీపీ సర్కారు ఆయనకు చుక్కలు చూపిస్తోంది. తాజాగా ప్రధాని మోడీ భీమవరం పర్యటన నేపథ్యంలో మరోసారి ఎంపీ రఘురామ కృష్ణంరాజును జగన్ సర్కారు ఇబ్బందులు పెడుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ కార్యక్రమానికి హాజరు కావాలని ఎంపీ రఘురామ కృష్ణంరాజు భావించినా.. ఆయన్ను ఈ కార్యక్రమానికి రాకుండా చేయడం లో జగన్ టీమ్‌ సక్సస్ అయ్యింది.

సాధారణంగా ఎక్కడైనా ప్రధాని కార్యక్రమం జరిగితే.. ఆ ప్రాంత ఎంపీని ఆహ్వానించడం ప్రొటోకాల్.. దీన్ని సాధారణంగా ఉల్లంఘించరు. కానీ.. ఎందుకో ప్రధాని మోదీ భీమవరం పర్యటన విషయంలో మాత్రం పీఎంఓ దీన్ని ఉల్లంఘించింది. అయితే.. ఇదంతా రాష్ట్ర ప్రభుత్వం తనపై పన్నిన కుట్రే అంటున్నారు ఎంపీ రఘురామ కృష్ణంరాజు. మొత్తానికి ఎంపీ రఘురామ కృష్ణంరాజు సొంత నియోజక వర్గానికి రావడం కూడా గగనమైపోయిందన్నమాట.


మరింత సమాచారం తెలుసుకోండి: