హిమాచల్‌ ప్రదేశ్‌ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. కులు జిల్లాలో బస్సు లోయలో పడిన ఘటనలో 16 మంది అక్కడికక్కడే మరణించారు. జంగ్లా గ్రామం వద్ద ఉదయం 8 గంటల సమయంలో ఈ ఘోర ప్రమాదం జరిగింది.  సైంజ్‌ ప్రాంతానికి వెళ్తోన్న బస్సు అదుపు తప్పి లోయలో పడిపోయింది. విషయం తెలుసుకున్న పోలీసులు, రెస్క్యూ సిబ్బంది వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్నారు. బస్సులో చిక్కుకున్న వారిని కాపాడేందుకు సహాయకచర్యలు చేపట్టారు.

ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 16 మృత దేహాలను బయటకు తీశారు. మృతుల్లో ఎక్కువ మంది పసివాళ్లు, మహిళలు ఉన్నారు. ప్రమాద జరిగిన సమయంలో బస్సులో 45 మంది వరకూ ఉన్నారు. ప్రమాదంలో గాయపడిన వారిని దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. లోయలోపడిన బస్సు.. పూర్తిగా నుజ్జునుజ్జయింది. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్టు సహాయ చర్యల్లో పాల్గొన్న అధికారులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: