ఏపీపీఎస్సీ గ్రూప్ -1 ఫలితాలు ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. ఈ  ఫలితాల్లో శరత్ చంద్ర ఐఏఎస్ అకాడమీ విద్యార్థులు 47 మంది ఎంపికయ్యారని ఈ కోచింగ్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ శరత్ చంద్ర తెలిపారు .  వేరే ఉద్యోగాలను చేస్తూ కూడా ఈ పరీక్షలో విజయం సాధించిన వాళ్లు చాలా మంది ఉన్నారని చెప్పారు . విజేతల్లో యూపీఎస్సీ ర్యాంక్స్ సాధించిన రమాకాంత్ రెడ్డి , తిరుపతి రావు కూడా ఉన్నారు . ఈ 47 మందిలో నలుగురు డిప్యూటీ కలెక్టర్లు రమాకాంత్ రెడ్డి , అంబరీష్ , కృష్ణా నాయక్ , ముగ్గురు డీ ఎస్ పీలు, ఆరుగురు టాక్స్ ఆఫీసర్లుగా ఎంపికయ్యారని శరత్ చంద్ర తెలిపారు.

గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చిన విద్యార్థులు ఎక్కువగా ఎంపిక అవ్వడం స్ఫూర్తి దాయకమని శరత్ చంద్ర అన్నారు. నాగ రాహుల్ అసిస్టెంట్ కమాండెంట్ గా పనిచేస్తూ కూడా ర్యాంక్ సాధించారు. ర్యాంక్ సాధించిన విద్యార్ధులతో ఇప్పుడే ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన విద్యార్ధులకు మోటివేషన్ సెషన్ ఇప్పిస్తామన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: