ఈ నేపథ్యంలో ఇండియా ఓ కీలక ప్రకటన చేసింది. శ్రీలంక ప్రజలకు ఇండియా అండగా ఉంటుందని తెలిపింది. ప్రజాస్వామ్య మార్గాలు, రాజ్యాంగ విలువలు, పురోగతి కోసం శ్రీలంక ప్రజలకు భారత్ ఎప్పుడూ అండగా నిలుస్తుందని భారత్ ప్రకటనలో తెలిపింది. శ్రీలంకకు భారత్ మొదటి నుంచి అండగానే నిలుస్తోంది. ఇప్పటివరకు ఇండియా శ్రీలంకకు 3.8బిలియన్ డాలర్ల సాయమందించింది. శ్రీలంక, ఆ దేశ ప్రజలు ఎదుర్కొంటున్న అనేక సవాళ్ల గురించి తమకు తెలుసని.. ఈ క్లిష్ట సమయాన్ని అధిగమించేందుకు ప్రయత్నిస్తున్న శ్రీలంక ప్రజలకు ఇండియా అండగా నిలుస్తుందని విదేశాంగ శాఖ ప్రకటించింది.
ఈ నేపథ్యంలో ఇండియా ఓ కీలక ప్రకటన చేసింది. శ్రీలంక ప్రజలకు ఇండియా అండగా ఉంటుందని తెలిపింది. ప్రజాస్వామ్య మార్గాలు, రాజ్యాంగ విలువలు, పురోగతి కోసం శ్రీలంక ప్రజలకు భారత్ ఎప్పుడూ అండగా నిలుస్తుందని భారత్ ప్రకటనలో తెలిపింది. శ్రీలంకకు భారత్ మొదటి నుంచి అండగానే నిలుస్తోంది. ఇప్పటివరకు ఇండియా శ్రీలంకకు 3.8బిలియన్ డాలర్ల సాయమందించింది. శ్రీలంక, ఆ దేశ ప్రజలు ఎదుర్కొంటున్న అనేక సవాళ్ల గురించి తమకు తెలుసని.. ఈ క్లిష్ట సమయాన్ని అధిగమించేందుకు ప్రయత్నిస్తున్న శ్రీలంక ప్రజలకు ఇండియా అండగా నిలుస్తుందని విదేశాంగ శాఖ ప్రకటించింది.