బీజేపీకి చంద్రబాబుకు గత ఎన్నికల నేపథ్యంలో దూరం బాగా పెరిగిన సంగతి తెలిసిందే. గత అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు.. మోడీ, అమిత్‌షాలను తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టారు. కానీ.. ఆ తర్వాత మళ్లీ మోడీయే ప్రధాని అయ్యాక.. చంద్రబాబు ఫుల్ సైలంట్ అయ్యారు.

కానీ చాలా రోజుల తర్వాత ఇప్పుడు ఓ బీజేపీ కేంద్ర మంత్రి చంద్రబాబును మెచ్చుకున్నారు. గిరిజన మహిళను రాష్ట్రపతిగా ఎన్నుకునేందుకు ముందుకొచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబుకు, తెలుగుదేశం పార్టీకి  కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. దేశవ్యాప్తంగా 42పార్టీలు ముర్ముకు మద్దతు తెలుపుతున్నాయని కేంద్ర మంత్రి  కిషన్ రెడ్డి అన్నారు.  స్వాతంత్య్రం వచ్చాక ఎక్కువ కాలం మహిళ గవర్నర్ గా పనిచేసింది ముర్మునేనని కేంద్ర మంత్రి  కిషన్ రెడ్డి తెలిపారు. అబ్దుల్ కలాం ను రాష్ట్రపతి గా ఎన్నుకోవటంలో చంద్రబాబు కీలకపాత్ర పోషించారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గుర్తు చేసుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: