ఏపీ సీఎం జగన్ ర్యాంకు ఏకంగా 20 వస్థానానికి పడిపోయిందా..అంటే అవునంటున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. తాజా సర్వేల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 20వ స్థానానికి పడిపోయారని ఆయన ప్రెస్‌మీట్‌లో కామెంట్ చేశారు. ప్రజలకు జగన్ అంటే కంపరం పుట్టిందని.. అందుకే 20 స్థానంలోకి వెళ్లారని అంటున్నారు. శ్రీలంకలో పాలకులు పారిపోయినా..., ప్రజల ఆగ్రహం చల్లారాలేదని గుర్తించాలన్న చంద్రబాబు.. వైసీపీ గ్రాఫ్ పడిపోయిందని వేరేవరో చెప్పడం దేనికీ.. వాళ్లకే రిపోర్టులు వచ్చాయని అంటున్నారు. గడప గడపకు ఎత్తిపోయింది నిజం కాదా అని ప్రశ్నించిన చంద్రబాబు.. గడపకు గడపకు కార్యక్రమం ఏమైంది, ప్లీనరీలో ఖాళీ కుర్చీలు దర్శనమిచ్చాయి అంటూ కామెంట్ చేశారు. అధికార దుర్వినియోగానికి వైసీపీ పరాకాష్టగా నిలిచిందని చంద్రబాబు కామెంట్ చేశారు. ఇప్పుడే ఇలా ఉంటే.. ముందు ముందు ఎన్నికల నాటికి జగన్ పరిస్థితి దారుణంగా తయారవుతుందని చంద్రబాబు అంచనా వేశారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలుపు ఖాయం అని చంద్రబాబు అంచనా వేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: