తెలంగాణ రాజ్ భవన్ లో నివసించే కుటుంబాలతో కలిసి గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ బోనాల పండుగ జరుపుకున్నారు. రాజ్ భవన్ ప్రాంగణంలోని ఆలయంలో అమ్మవారికి 'బోనాలు' సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. రాష్ట్ర ప్రజలందరికీ బోనాల శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ .. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని దేవతలకు ప్రత్యేక పూజలు చేస్తారని.. బోనాల పండుగ వెనుక ఎంతో చరిత్ర ఉందని తెలిపారు.


అషాడ, శ్రావణ మాసాల్లో బోనాల పండుగను ఎంతో భక్తితో నిర్వహిస్తారన్న గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ .. ఆషాడ మాసంలో ఎక్కువగా నల్ల పోచమ్మను కొలుస్తారన్నారు.ఈ సంవత్సరం బోనాల పండగ నిర్వహించేందుకు ఒక ప్రత్యేకత ఉందని.. అమ్మవారి దయవల్ల సాధారణ పరిస్థితులు నెలకొన్నాయని గవర్నర్ తమిళిసై సౌందర రాజన్  అన్నారు. అమ్మవారి ఆశీస్సులు అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నానన్న గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ .. తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీక బోనాల పండుగ అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: