ఆన్‌లైన్‌ మేట్రిమోనీ మోసాలు పెరిగిపోతున్నాయి. పల్నాడు జిల్లా నరసరావుపేటలో ఓ మహిళ ఆన్ లైన్ మోసగాడి వలలో చిక్కుకుని  ఏకంగా 48 లక్షలు పోగొట్టుకుంది. ఇంతకీ ఏమైందంటే.. ఓ అమ్మాయి ఓ మాట్రిమోనిలో పేరు నమోదు చేసుకుంది. అదే మాట్రిమోనిలో నమోదై ఉన్న  విశాఖకు చెందిన శ్రీకాంత్ అనే కుర్రాడిని ఇష్టపడింది. అతగాడు అమెరికాలో ఉద్యోగం చేస్తున్నట్లు ఆ అమ్మాయిని నమ్మించాడు.

అమెరికా తీసుకెళ్లడానికి వీసా కోసం డబ్బు పంపించమన్నాడు. అతడిని నమ్మి ఏకంగా 48 లక్షల రూపాయలు అతడి అకౌంట్‌కు ట్రాన్స్‌ఫర్ చేసింది. అంతే ఆ తర్వాత అతడి నుంచి ఎలాంటి సమాచారం లేదు. దీంతో మోసపోయనని గ్రహించిన ఆ అమ్మాయి తన సోదరుడి ద్వారా పోలీసులకు కంప్లయింట్ చేసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అందుకే కాస్త అమ్మాయిలూ.. మాట్రిమోనీలో కాస్త జాగ్రత్త.

మరింత సమాచారం తెలుసుకోండి: