తెలంగాణలో టీఆర్ఎస్‌ అధికార పార్టీ.. అయినా ఆ పార్టీ నుంచి వరుసగా రాజీనామాలు కలకలం సృష్టిస్తున్నాయి. ఈ రాజీనామాలు ఎక్కడ అంటారా..  నాగర్‌ కర్నూల్‌ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గంలోని వెల్దండలో తెరాస నాయకులు రాజీనామాలు  చేస్తున్నారు. వెల్దండ మండల ఎంపీపీ విజయ, ఆరుగురు సర్పంచులు పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు తమ రాజీనామాలను పార్టీ మండలాధ్యక్షుడు భూపతి రెడ్డికి అందించారు.

కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్‌ యాదవ్‌ వైఖరికి నిరసనగా రాజీనామా చేస్తున్నామని తెలిపారు. ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం వైస్‌ ఛైర్మన్‌ వావిళ్ల సంజీవ్‌ కుమార్‌ యాదవ్‌ కూడా పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను సంఘం కార్యదర్శి శ్రీనివాసులుకు ఇచ్చారు. కల్వకుర్తి మార్కెట్‌ ఛైర్మన్‌ నియామకం విషయంలో అన్యాయం జరిగిందంటున్నారు సంజీవ్‌ కుమార్‌ యాదవ్‌. రాజీనామా లేఖలు అందుకున్న పార్టీ మండలాధ్యక్షుడు భూపతి రెడ్డి.. నేతలను తొందరపడొద్దని సూచించారు. కల్వకుర్తి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మండల ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: