మాటలు కోటలు దాటుతున్నాయి.. చేతలు కడప దాటడం లేదు అన్నట్టుంది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీరు అంటున్నారు పీసీసీ కార్యనిర్వాహ అధ్యక్షుడు తులసి రెడ్డి. కడప- రాయచోటి - మదనపల్లి - బెంగళూరు నూతన రైలు మార్గానికి మ్యాచింగ్ గ్రాంట్ ఇచ్చేటందుకు దిక్కులేదు గాని మూడు రాజధానులు నిర్మిస్తారట అని తులసి రెడ్డి ఎద్దేవా చేశారు.

కాంగ్రెస్ పాలనలో 2006-07 లో 3038 కోర్టు అంచనా తో 268 కిలోమీటర్లు 50 శాతం మ్యాచింగ్ గ్రాంట్ రాష్ట్ర ప్రభుత్వం భరించే షరతుతో మంజూరు అయిందని ఆయన తెలిపారు.  రూ 351 కోట్లు ఖర్చు చేసి కడప నుంచి పెండ్లిమర్రి వరకు 21 కిలోమీటర్లు పూర్తి అయిందని అన్నారు.  నాడు జగన్ ముఖ్యమంత్రి అయ్యాక మ్యాచింగ్ గ్రాండ్ విడుదల కాలేదని దీంతో రైల్వే శాఖ పనులు  నిలిపి వేసిందని పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: