విత్తన సరఫరా లో ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు ఎరువులు లభించక ఇబ్బందులు ఎదుర్కోవడంతోపాటు ధరలు విపరీతంగా పెరగడంతో పంట పెట్టుబడి పెరిగిందన్నారు. అరకొర దిగుబడి గిట్టుబాటు ధర లేక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని పేర్కొన్నారు. ఇటీవల వరదల కారణంగా వేలాది ఎకరాల్లో రైతులు పంటలు కోల్పోయినప్పటికీ ప్రజాప్రతినిధులు, మంత్రులు ప్రజల్లో తిరిగే పరిస్థితి లేదన్నారు. కష్టాల్లో ఉన్న రైతులను ఆదుకోవాలని ధ్యాస, ఆలోచన ప్రభుత్వానికి లేదని దుయ్యబట్టారు. మూడేళ్ల జగన్ రెడ్డి పాలనలో 212 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని పేర్కొన్నారు. అప్పుల బాధలు తాళ్ళలేక, పంటదిగుబడి లేక చేసిన అప్పులు తీర్చే మార్గం లేక ఆత్మహత్యలే శరణ్యమని రైతులు భావిస్తున్నట్లు తెలిపారు. రైతు ఆత్మహత్యల్లో ఆంధ్ర రాష్ట్రం దేశంలో రెండవ స్థానంలో ఉందన్నారు.
విత్తన సరఫరా లో ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు ఎరువులు లభించక ఇబ్బందులు ఎదుర్కోవడంతోపాటు ధరలు విపరీతంగా పెరగడంతో పంట పెట్టుబడి పెరిగిందన్నారు. అరకొర దిగుబడి గిట్టుబాటు ధర లేక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని పేర్కొన్నారు. ఇటీవల వరదల కారణంగా వేలాది ఎకరాల్లో రైతులు పంటలు కోల్పోయినప్పటికీ ప్రజాప్రతినిధులు, మంత్రులు ప్రజల్లో తిరిగే పరిస్థితి లేదన్నారు. కష్టాల్లో ఉన్న రైతులను ఆదుకోవాలని ధ్యాస, ఆలోచన ప్రభుత్వానికి లేదని దుయ్యబట్టారు. మూడేళ్ల జగన్ రెడ్డి పాలనలో 212 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని పేర్కొన్నారు. అప్పుల బాధలు తాళ్ళలేక, పంటదిగుబడి లేక చేసిన అప్పులు తీర్చే మార్గం లేక ఆత్మహత్యలే శరణ్యమని రైతులు భావిస్తున్నట్లు తెలిపారు. రైతు ఆత్మహత్యల్లో ఆంధ్ర రాష్ట్రం దేశంలో రెండవ స్థానంలో ఉందన్నారు.