రాష్ట్రంలో బెస్త కులస్తులకు అన్ని రాజకీయ పార్టీలు రాజకీయ ప్రాధాన్యత కల్పించాలని డిమాండ్ ఆ కులస్తులు ఆందోళలు ఉధృతం చేస్తున్నారు. ఇటీవల విజయవాడ ధర్నా చౌక్ లో గ్రేటర్ రాయలసీమ బెస్తల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రాజ్యాధికార దీక్షను చేపట్టారు.  రాయలసీమ ప్రాంతంలో బెస్తలకు నాలుగు ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ సీట్లు ఇవ్వాలని  బెస్తల సంక్షేమ సంఘం అధ్యక్షులు కేవీ రమణ డిమాండ్ చేశారు.

చట్టసభల్లో బెస్తవారికి ప్రాధాన్యత కల్పించాలని అన్ని రాజకీయ పార్టీలను కోరుతున్నామని బెస్తల సంక్షేమ సంఘం అధ్యక్షులు కేవీ రమణ  అన్నారు. అధికార వైసీపీ నామినేటెడ్ పదవుల్లో బెస్త కులాల వారికి ప్రాధాన్యత ఇవ్వాలని బెస్తల సంక్షేమ సంఘం అధ్యక్షులు కేవీ రమణ కోరారు. దశాబ్దాలుగా రాజ్యాధికారానికి దూరంగా ఉన్న బెస్తలను పట్టించుకోకుంటే అన్ని రాజకీయ పార్టీలు భవిష్యత్తులో తీవ్రంగా నష్టపోతాయని బెస్తల సంక్షేమ సంఘం అధ్యక్షులు కేవీ రమణ  హెచ్చరించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: