రాష్ట్రంలో మహిళా చట్టాలు ఎక్కడా అమలుకు నోచుకోవడం లేదని, రాష్ట్రం ప్రభుత్వం మహిళల రక్షణకు చర్యలు తీసుకోవడంలేదని ఐద్వా నేతలు మండిపడ్డారు. ఏపీలో ప్రతి రోజు అత్యాచారాలు,హత్యలు జరుగుతున్నాయని వారు విమర్శించారు. మహిళలకు సమాన హక్కులు, అవకాశాలు లేకుండా చేస్తున్నారనే నినాదంతో నెల్లూరు నగరంలో ఐద్వా రాష్ట్ర మహాసభలు నిర్వహించారు.  రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి వచ్చిన వేలాది మంది మహిళలతో సమావేశం నిర్వహించారు. మహా ప్రదర్శనలో మహిళలు ఐద్వా జెండాలతో నినాదాలు చేశారు. దేశంలో రాష్ట్రంలో మహిళలకు భద్రత కరువైందని విమర్శించారు.


అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం 15వ రాష్ట్ర మహాసభలు సందర్భంగా నెల్లూరు నగరంలోని నర్తకీ కూడలిలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. మహిళా హక్కులను కాపాడాలని.. మహిళలకు రక్షణ కల్పించాలని నినాదాలు చేశారు. ప్రభుత్వాలు మహిళా చట్టాలను గౌరవించడంలేదని, వారికి రక్షణ లేకుండా చేస్తున్నారని మహిళా నేతలు అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: