అమరావతి రైతుల పోరాటానికి బీజేపీ మద్దతు ఇస్తోంది. అయితే.. ఏకైక రాజధాని అమరావతి అని ప్రధాని మోడీతో చెప్పించాలని ఏపీ పీసీసీ అధ్యక్షులు శైలజానాథ్ డిమాండ్ చేస్తున్నారు. హోదా విభజన హామీలు అమలు చేయకపోతే సమావేశం బాయ్ కాట్ చేస్తామని రాష్ట్ర బీజేపీ నేతలు చెప్పాలని పీసీసీ అధ్యక్షులు శైలజానాథ్ డిమాండ్ చేస్తున్నారు. బీజేపీ నేతలు ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పోరాడాల్సిన అవసరం ఉందన్నారు.


జగన్ చేస్తున్న అకృత్యాలు బీజేపీకి తెలియవా అని  పీసీసీ అధ్యక్షులు  శైలజానాథ్  ప్రశ్నించారు. ఈ రెండు పార్టీ లు కలిసి ఎంత కాలం మోసం చేస్తాయని  పీసీసీ అధ్యక్షులు శైలజానాథ్ అన్నారు. మోదీ, జగన్ పై పోరాటానికి అన్ని పార్టీలు ఏకం కావాలని పీసీసీ అధ్యక్షులు శైలజానాథ్ పిలుపునిస్తున్నామన్నారు. ఈనెల ఎనిమిదిన ఎపిసిసి విస్తృత స్థాయి సమావేశం విజయవాడ లో జరుగుతుందని ఆ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు ప్రణాళిక ప్రకటిస్తామని ఆయన అన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: