గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఇప్పటంలో ఫ్లెక్సీవార్ నడుస్తోంది. అసలు జనసేన సభకు స్థలాలు ఇచ్చిన వారి ఇళ్లు పడేయలేదన్న ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు. ఈ మాటలను ఇప్పటం గ్రామస్తులు తప్పుబడుతున్నారు. సభకు ఎవరెవరు  భూములిచ్చారో ఫొటోలతో సహా ఫ్లెక్సీల ద్వారా ప్రదర్శించారు. గ్రామంలో కొంతమంది వైసీపీ కార్యకర్తలు తమ ఇళ్ల వద్ద ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకున్నారు.

దీనిపై బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ఇళ్లను ప్రభుత్వం కూలగొట్టలేదు.. మీ సానుభూతి అవసరంలేదు....డబ్బులిచ్చి ఆబద్దాన్ని నిజం చేయాలనే ప్రయత్నం వద్ద అంటూ కొంత మంది వైసీపీ కార్యకర్తలు తమ ఇళ్ల వద్ద ఫ్లెక్సీలు కట్టారు. ఫ్లెక్సీలు కట్టిన దగ్గర్నుంచి తమపై అధికార పార్టీ నేతల బెదిరింపులు ఎక్కువయ్యాయని గ్రామస్తులు చెబుతున్నారు. వైసీపీ నేతలు ఇదే ధోరణని అవలంభిస్తే వారి అక్రమాలను ప్రజల ముందు పెడతామని కొందరు  హెచ్చరించారు. మొత్తానికి ఇప్పటంలో ఫ్లెక్సీవార్ నడుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: