ఇవాళ తెలంగాణకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వస్తున్నారు. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని ప్రధాని నరేంద్ర మోదీ జాతికి అంకితం చేయనున్నారు. దీంతో పాటు పలు అభివృద్ధి పనులను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. విశాఖపట్నం నుంచి బేగంపేట విమానాశ్రయంకు మధ్యాహ్నం 1:30కి ప్రధాని నరేంద్ర మోదీ చేరుకోనున్నారు. బేగంపేట విమానాశ్రయం వద్ద బీజేపీ ఆధ్వర్యంలో బహిరంగ సభ నిర్వహిస్తారు.
 

బీజేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బహిరగసభలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొంటారు. మధ్యాహ్నం 1:40కి సభా స్థలికి చేరుకుని 2గంటల వరకు 20నిమిషాల పాటు పార్టీ శ్రేణులను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ ప్రసగిస్తారు. సభ అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ హెలికాప్టర్ లో రామగుండంకు వెళ్లనున్నారు. ఆ తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ రామగుండం పర్యటన ముగిచుకుని సాయంత్రం 6:35కి బేగపేట విమానాశ్రయంకు చేరుకుంటారు. 6: 40కి బేగంపేట నుంచి ప్రత్యేక విమానంలో ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీకి వెళ్తారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

kcr