వైద్యారోగ్య రంగానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్న మంత్రి విడదల రజని.. వేల కోట్ల రూపాయలతో వైద్యారోగ్య సేవలను మెరుగుపరుస్తున్నామన్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లా పరిధిలో జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశాన్ని ఆమె గుంటూరులో నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి విడదల రజని రాష్ట్రంలో కొత్తగా 17 వైద్య కళాశాలలు రానున్నాయని చెప్పారు. పాత అర్బన్ హెల్త్ సెంటర్లు, పీహెచ్ సీలు ఆధునీకరించనున్నామని మంత్రి విడదల రజని చెప్పారు.
వైద్యారోగ్య రంగానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్న మంత్రి విడదల రజని.. వేల కోట్ల రూపాయలతో వైద్యారోగ్య సేవలను మెరుగుపరుస్తున్నామన్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లా పరిధిలో జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశాన్ని ఆమె గుంటూరులో నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి విడదల రజని రాష్ట్రంలో కొత్తగా 17 వైద్య కళాశాలలు రానున్నాయని చెప్పారు. పాత అర్బన్ హెల్త్ సెంటర్లు, పీహెచ్ సీలు ఆధునీకరించనున్నామని మంత్రి విడదల రజని చెప్పారు.