ఏపీ మంత్రి విడదల రజని జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై ఘాటు విమర్శలు చేశారు. జగనన్న ప్రభుత్వం అందిస్తున్న సేవలకు ప్రజల నుంచి లభిస్తోన్న ఆదరణ చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు బురద జల్లుతున్నాయని మంత్రి విడదల రజని ఆరోపించారు. చంద్రబాబు ప్రయోజనాల కోసం పవన్ కల్యాణ్ మాట్లాడుతున్నారని మంత్రి విడదల రజని అన్నారు. అంతేకాదు పవన్ కల్యాణ్ వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని మంత్రి విడదల రజని వార్నింగ్ ఇచ్చారు.


వైద్యారోగ్య రంగానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్న మంత్రి విడదల రజని.. వేల కోట్ల రూపాయలతో వైద్యారోగ్య సేవలను మెరుగుపరుస్తున్నామన్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లా పరిధిలో జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశాన్ని ఆమె గుంటూరులో నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి విడదల రజని రాష్ట్రంలో కొత్తగా 17 వైద్య కళాశాలలు రానున్నాయని చెప్పారు. పాత అర్బన్ హెల్త్ సెంటర్లు, పీహెచ్ సీలు ఆధునీకరించనున్నామని మంత్రి విడదల రజని చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: