కృష్ణా జిల్లా గన్నవరంలో ఓ పాస్టర్‌ వింత ప్రవర్తన కలకలం రేపుతోంది. తాను చనిపోయి సమాధి నుంచి మళ్లీ తిరిగొస్తా అంటున్నాడు. ఆ విషయాన్ని ఫ్లెక్సీలు కూడా కట్టించుకున్నాడు సదరు పాస్టర్‌ నాగభూషణం. అంతే కాదు.. గొల్లనపల్లిలోని తన స్థలంలో సమాధి కోసం గొయ్యిని కూడా తవ్వించుకున్నాడు. 10 రోజుల్లో తాను చనిపోతే ఇదే సమాధిలో పెట్టాలని..మళ్లీ 3 రోజుల్లో బ్రతికి వస్తా అంటూ కుటుంబ సభ్యులకు, గ్రామస్తులకు చెబుతున్నాడీ పాస్టర్ గారు.


పాస్టర్ వైఖరితో ఆయన కుటుంబ సభ్యులు, ఇటు గ్రామస్తులు కంగారు పడుతున్నారు. అసలు ఏం జరుగుతుందోనని ఆందోళన చెందుతున్నారు. అయితే ఇదంతా పబ్లిసిటీ స్టంట్ అనేవారూ లేకపోలేదు.. ఏదేమైనా ఇలాంటి పాస్టర్లు ప్రజలను కూడా అపనమ్మకాలవైపు నడిపిస్తారు. ఆ పాస్టర్‌కు కౌన్సిలింగ్ ఇప్పించాలి. అయినా మారని పక్షంలో మానసిక వికలాంగుల సంరక్షణ శాలకు తరలించి చికిత్స అందించాలి. మరి మీరేమంటారు.?


మరింత సమాచారం తెలుసుకోండి: