టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‍ పై ఎంపీ విజయసాయిరెడ్డి మాట్లాడే మాటలు సరైనవి కాదని టీడీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.ఎస్‌.రాజు అంటున్నారు. విజయ సాయి రెడ్డి తన పద్దతి మార్చుకోవాలని ఆయన హితవు పలికారు. దళిత సంక్షేమం పై మంత్రి నాగార్జున శ్వేతపత్రం విడుదల చేయాలని టీడీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.ఎస్‌.రాజు డిమాండ్‍ చేశారు. జగన్మోహన్‍ రెడ్డి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి దళిత సంక్షేమాన్ని నిర్వీర్యం చేస్తున్నారంటూ టీడీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.ఎస్‌.రాజు ఆరోపించారు.


తిరుపతి నగరంలోని ఎన్టీఆర్‍ కూడలి నుంచి బస్టాండ్ సమీపంలోని అంబేడ్కర్‍ కూడలి వరకు ఎస్సీ సెల్‌ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించిన నేతలు.. ముఖ్యమంత్రి జగన్మోహన్‍ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తిరుపతి వేదికగా ప్రారంభమైన ర్యాలీ అన్ని జిల్లా కేంద్రాలలో నిర్వహిస్తామని టీడీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.ఎస్‌.రాజు  ప్రకటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: