ఒక్క ఛాన్స్.. గత ఎన్నికల్లో జగన్ వాడిన డైలాగ్ ఇది.. ఒక్క అవకాశం ఇస్తే.. తానేం చేస్తానో చెప్పి గత ఎన్నికల్లో జగన్ ఓట్లడిగారు. జనం కూడా ఆ ఒక్క ఛాన్స్ ఇచ్చారు. ఇప్పుడు బీజేపీ కూడా అదే డైలాగ్ ఏపీలో వాడుతోంది. వైసీపీ పాలనతో రాష్ట్ర ప్రజలు విసిగిపోయారని.. తమకు ఒక్క ఛాన్స్ ఇవ్వాలని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అంటున్నారు. దుష్ట పరిపాలనకు ఏపీ అడ్డాగా మారిందన్న జీవీఎల్ నరసింహారావు... ఓటు బ్యాంక్ రాజకీయాలు తప్ప రాష్ట్రాభివృద్ధిపై జగన్ దృష్టి పెట్టలేదని తీవ్రంగా విమర్శించారు.

ఐటి అంటే ఆంధ్రప్రదేశ్ గా గతంలో ఉండేదని.. సుమారు 8 లక్షల మంది ఏపీ నుంచి వెళ్ళినవారు ఉన్నారని నరసింహారావు అన్నారు. ప్రస్తుతం ఐటీ కంపెనీలు ఏపీకి ఒక్కటీ రాలేదని, ఉన్నవాటిని తరిమేస్తున్నారని బీజేపీ ఎంపీ జీవీఎల్ ఆరోపించారు. ఐటీ రంగంలో వైసీపీ ఏం చేసిందో చెప్పాలని బీజేపీ ఎంపీ జీవీఎల్  డిమాండ్ చేశారు. ఏపీలో ఒక్క అవకాశం ఇస్తే సుపరిపాలన అంటే ఏంటో చూపిస్తామని...ప్రత్యామ్నాయం వైపు ప్రజలు చూస్తున్నారని జీవీఎల్ అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

bjp