ఇటీవల ఏపీ హైకోర్టు అధికారులకు చుక్కలు చూపిస్తోంది. కోర్టు ధిక్కరణ కేసుల విషయంలో కఠినంగా వ్యవహరిస్తోంది. తాజాగా ఇద్దరు జిల్లా పంచాయితీ అధికారులకు కోర్టు ధిక్కార కేసులో  ఏపీ హైకోర్టు జైలు శిక్ష విధించింది. గతంలో కర్నూలు జిల్లా డీపిఓగా పనిచేసి ప్రస్తుతం అనంతపురంలో ఉన్న ప్రభాకర్ రావుకు వారం రోజులు జైలు శిక్ష, 2 వేలు జరిమానా  విధించింది ఏపీ హైకోర్టు. మరో కేసులో ఏపీ హైకోర్టు చిత్తూరు జిల్లా పంచాయితీ అధికారి దసరదరామిరెడ్డికి 15 రోజులు జైలు శిక్ష, 2 వేల రూపాయలు జరిమానా విధించింది.

అయితే.. తీర్పు అమలును వారం రోజుల పాటు నిలిపివేసిన ఏపీ హైకోర్టు అప్పీల్ కు వెళ్లే అవకాశం ఇచ్చింది. సింగవరం గ్రామంలో జలవనరుల శాఖ స్థలంలో గ్రామ సచివాలయం నిర్మాణం పై గతంలో  హైకోర్టు స్టే ఇచ్చింది. అయితే.. స్టే ఉన్నప్పటికీ అప్పటి కర్నూలు జిల్లా డీపీఓ ప్రభాకర్ రావు సర్పంచ్ చెక్ పవర్ ను సస్పెండ్ చేసి ఈఓ ఆర్‌డీ ద్వారా చెల్లింపులు చేశారని  ఆరోపణలు వచ్చాయి. సూమోటోగా కోర్టు ధిక్కార కేసు నమోదు చేసిన ఏపీ హైకోర్టు విచారణ జరిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి: