హైదరాబాద్ లోని హయత్‌నగర్‌ మండలం మన్సూరాబాద్‌ గ్రామ పరిధిలో దోబీఘాట్‌ కబ్జాకు గురవుతోంది. 40 నుంచి 50 సంవత్సరాలుగా దోబీఘాట్‌గా వాడుకుంటున్న స్థలాన్ని కొందరు కబ్జాకోసం యత్నిస్తున్నారంటూ రజకులు ఆందోళన చెందుతున్నారు. మూడు రోజులుగా అక్కడ ధర్నా నిర్వహిస్తున్నారు. తాజాగా కాంగ్రెస్ పార్టీ వారి ఆందోళనకు మద్దతు తెలియచేసింది.


దోబీఘాట్ కబ్జాకు గురి కాకుండా కాంపౌండ్‌ వాట్‌ నిర్మించేందుకు ఎంపీ నిధులు తెస్తామని ఎల్బీనగర్‌ కాంగ్రెస్‌ ఇంఛార్జి మల్ రెడ్డి రామిరెడ్డి అంటున్నారు.  ఇప్పటికే ఆ స్థల రక్షణకు ఎంపీ రేవంత్‌ రెడ్డి అయిదు లక్షలు తమ ఎంపీ ల్యాడ్స్‌ ద్వారా ఇచ్చారని తెలిపారు. జీహెచ్‌ఎంసీ అధికారులు ఇంతవరకు అంచనావేయడం లేదట. ఆ స్థలం ఎట్టి పరిస్థితుల్లోనూ కబ్జాకాకుండా చూస్తామని చెబుతున్న కాంగ్రెస్ నేత రామిరెడ్డి....కాంపౌండ్‌ వాల్‌ నిర్మాణానికి ఎంత ఖర్చయినా అందుకు అయ్యే మొత్తం ఎంపీ ల్యాడ్స్‌ నుంచి ఇప్పిస్తానన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: