బీజేపీ కోసమే కేసీఆర్‌ జాతీయ రాజకీయాలు అంటూ బయలుదేరారని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి అంటున్నారు. కర్ణాటక కాంగ్రెస్‌ నేతలు కొందరు కేసీఆర్ ను కలిశారని తాను చెప్పింది నిజమని బయటపడిందని రేవంత్ రెడ్డి అన్నారు. పైలెట్‌ రోహిత్ రెడ్డి తనను కేసీఆర్‌తో కలిపించారని కర్ణాటక కాంగ్రెస్ నేత జమీర్ స్వయంగా చెప్పారని రేవంత్ రెడ్డి అన్నారు. రోహిత్ రెడ్డి పార్టీ ఫిరాయింపుల కేసులో ఉన్న కీలక వ్యక్తిగా రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.


కుమారస్వామి లాంటి నేతలు కలిసినప్పుడు బయటకు ఇచ్చిన సమాచారాన్ని... వ్యాపారం కోసం కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కలిసినప్పుడు ఎందుకు గోప్యంగా ఉంచారని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో  కేసీఆర్ బేరసారాలు చేశారన్న రేవంత్ రెడ్డి... వాళ్లు కేసీఆర్ డీల్‌కు ఒప్పుకోలేదని చెప్పారు. తాను చేసిన ఆరోపణలకు ఆధారాలు బయటకు వచ్చాయని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కర్ణాటకలో కాంగ్రెస్‌ను ఓడించేందుకు కేసీఆర్ చేస్తున్న కుట్ర బయటపడిందని రేవంత్ రెడ్డి అన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: