ఆర్టీసీ కొరియర్ సర్వీసును మరింత విస్తృతం చేసే దిశగా అధికారులు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా ఇకపై వినియోగదారులు బుక్ చేసుకున్న పార్శిల్ ను నేరుగా వారి అడ్రస్ కే అందివ్వాలని నిర్ణయించారు. అయితే ఇందుకోసం ఆర్టీసీ అదనపు రుసుం వసూలు చేస్తుంది. ఇప్పటి వరకు వసూలు చేస్తున్న రుసుం కేవలం ఆర్టీసీ బస్టాండ్ వరకు మాత్రమే. అయితే ఇంటికి నేరుగా చేరుకోవాలంటే మాత్రం ఇకపై ఒక కేజీ బరువుకు 15 రూపాయలు, ఒకటి నుంచి ఆరు కేజీల బరువున్న వస్తువులకు 25 రూపాయలు, ఆరు నుంచి 10 కేజీల బరువున్న పార్శిల్ కు అయితే 30 రూపాయల రుసుంతో పాటు జీఎస్టీ కూడా చెల్లించాల్సి ఉంటుంది. ఈ సర్వీసును సెప్టెంబర్ ఒకటవ తేదీ నుంచి.. అంటే రేపటి నుంచే ప్రారంభించనుంది ఆర్టీసీ సంస్థ. అయితే తొలిదశలో నగరాల నుంచి పది కీలోమీటర్ల పరిధిలో మాత్రం డోర్ డెలివరీ ఉంటుందని... ఈ ప్రయోగం విజయవంతమైతే... రాష్ట్ర వ్యాప్తంగా విస్తరిస్తామంటున్నారు అధికారులు. కొరియర్ సర్వీసు, లాజిస్టిక్ కోసం ఇప్పటికే పాత బస్సులను లగేజ్ పార్శిల్ వ్యాన్లుగా ఆర్టీసీ మారుస్తోంది. సంస్థ ఆదాయంలో దాదాపు 40 శాతం లాజిస్టిక్ సర్వీసు ద్వారానే ప్రస్తుతం లభిస్తోంది.
ఆర్టీసీ కొరియర్ సర్వీసును మరింత విస్తృతం చేసే దిశగా అధికారులు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా ఇకపై వినియోగదారులు బుక్ చేసుకున్న పార్శిల్ ను నేరుగా వారి అడ్రస్ కే అందివ్వాలని నిర్ణయించారు. అయితే ఇందుకోసం ఆర్టీసీ అదనపు రుసుం వసూలు చేస్తుంది. ఇప్పటి వరకు వసూలు చేస్తున్న రుసుం కేవలం ఆర్టీసీ బస్టాండ్ వరకు మాత్రమే. అయితే ఇంటికి నేరుగా చేరుకోవాలంటే మాత్రం ఇకపై ఒక కేజీ బరువుకు 15 రూపాయలు, ఒకటి నుంచి ఆరు కేజీల బరువున్న వస్తువులకు 25 రూపాయలు, ఆరు నుంచి 10 కేజీల బరువున్న పార్శిల్ కు అయితే 30 రూపాయల రుసుంతో పాటు జీఎస్టీ కూడా చెల్లించాల్సి ఉంటుంది. ఈ సర్వీసును సెప్టెంబర్ ఒకటవ తేదీ నుంచి.. అంటే రేపటి నుంచే ప్రారంభించనుంది ఆర్టీసీ సంస్థ. అయితే తొలిదశలో నగరాల నుంచి పది కీలోమీటర్ల పరిధిలో మాత్రం డోర్ డెలివరీ ఉంటుందని... ఈ ప్రయోగం విజయవంతమైతే... రాష్ట్ర వ్యాప్తంగా విస్తరిస్తామంటున్నారు అధికారులు. కొరియర్ సర్వీసు, లాజిస్టిక్ కోసం ఇప్పటికే పాత బస్సులను లగేజ్ పార్శిల్ వ్యాన్లుగా ఆర్టీసీ మారుస్తోంది. సంస్థ ఆదాయంలో దాదాపు 40 శాతం లాజిస్టిక్ సర్వీసు ద్వారానే ప్రస్తుతం లభిస్తోంది.