తాజాగా దేశీయ మార్కెట్లు మరో కొత్త రికార్డును సొంతం చేసుకున్నాయి. సెన్సెక్స్ నేడు 60 వేల మార్క్ దాటి కొత్త రికార్డు నెలకొల్పింది. కరోనా సంక్షోభం తరువాత ఈ రికార్డు ఆర్థికపురోభివృద్దిని ఉత్సాహపరుస్తుందని నిపుణులు అంటున్నారు. నేడు రోజంతా లాభాలతో కొనసాగిన మార్కెట్లు ముగిసే సమయానికి 60148 వద్ద ముగిశాయి. నిఫ్టీ కూడా 30 పాయింట్లు పెరిగి 17853 వద్ద ముగిసింది. నిన్న కూడా దేశీయ సూచికలు ఉత్సాహంగానే ఉండటం తెలిసందే.
బీఎస్ఈ సెన్సెక్స్ లో బాగా లాభాలు పొందిన వారిలో ఏషియన్ పెయింట్స్ 3.72 శాతం; మహీంద్రా అండ్ మహీంద్రా 2.74 శాతం; హెచ్ డి ఎఫ్ సి బ్యాంకు 1.98 శాతం; భారతీయ ఎయిర్ టెల్ 1.79 శాతం; మారుతి సుజుకి 1.59 శాతంగా ఉన్నాయి.
నష్టాలలో ట్రేడ్ అయిన వారిలో టాటా స్టీల్; స్టేట్ బ్యాంక్ అఫ్ ఇండియా; యాక్సిస్ బ్యాంకు; ఐటీసీ; హిందూస్తాన్ యూనీలీవర్ లు ఉన్నాయి.