ప్రస్తుతం బోర్డులో ఉన్న నలుగురు ఫంక్షనల్ డైరెక్టర్లు, ఇద్దరు ప్రభుత్వ నామినీ డైరెక్టర్లు, ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ పదవుల్లో ఉన్నారు. వీరంతా ప్రస్తుతం ప్రభుత్వం తరఫున ఎయిర్ ఇండియా బాధ్యతలను పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతంల ఉన్న నియమాల ప్రకారం ఎయిర్ ఇండియాను కొనుగోలు చేసిన టాటా సన్స్ సంస్థకు అప్పగించే ముందే బోర్డు ఆఫ్ డైరెక్టర్లు తమ పదవులకు రాజీనామా చేయాల్సి ఉంటుంది. దీంతో వచ్చే నెలలో ఎయిర్ ఇండియా సంస్థ చివరి బోర్డు సమావేశంలో ఏడుగురు బోర్డు సభ్యులు తమ రాజీనామాలు సమర్పించాల్సి ఉంది. ఇదే విషయాన్ని ఎయిర్ లైన్స్ అధికారులు వెల్లడిస్తున్నారు. రాజీనామా విషయంపై బోర్డు సభ్యులకు ఈ నెల 15వ తేదీనే ప్రభుత్వం నుంచి సమాచారం వచ్చినట్లు తెలుస్తోంది. డిసెంబర్ రెండో వారంలో బోర్డు సమావేశం కానుంది. ఇదే ఈ బోర్డుకు చివరి సమావేశం కానుంది. ప్రస్తుత ఎయిర్ ఇండియా బోర్డులో నాన్ అఫీషియల్ డైరెక్టర్గా బీజేపీ సీనియర్ నేత సయ్యద్ జాఫర్ ఉన్నారు. ఆయన కూడా తన పదవికి రాజీనామా చేయాల్సి ఉంది.
ప్రస్తుతం బోర్డులో ఉన్న నలుగురు ఫంక్షనల్ డైరెక్టర్లు, ఇద్దరు ప్రభుత్వ నామినీ డైరెక్టర్లు, ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ పదవుల్లో ఉన్నారు. వీరంతా ప్రస్తుతం ప్రభుత్వం తరఫున ఎయిర్ ఇండియా బాధ్యతలను పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతంల ఉన్న నియమాల ప్రకారం ఎయిర్ ఇండియాను కొనుగోలు చేసిన టాటా సన్స్ సంస్థకు అప్పగించే ముందే బోర్డు ఆఫ్ డైరెక్టర్లు తమ పదవులకు రాజీనామా చేయాల్సి ఉంటుంది. దీంతో వచ్చే నెలలో ఎయిర్ ఇండియా సంస్థ చివరి బోర్డు సమావేశంలో ఏడుగురు బోర్డు సభ్యులు తమ రాజీనామాలు సమర్పించాల్సి ఉంది. ఇదే విషయాన్ని ఎయిర్ లైన్స్ అధికారులు వెల్లడిస్తున్నారు. రాజీనామా విషయంపై బోర్డు సభ్యులకు ఈ నెల 15వ తేదీనే ప్రభుత్వం నుంచి సమాచారం వచ్చినట్లు తెలుస్తోంది. డిసెంబర్ రెండో వారంలో బోర్డు సమావేశం కానుంది. ఇదే ఈ బోర్డుకు చివరి సమావేశం కానుంది. ప్రస్తుత ఎయిర్ ఇండియా బోర్డులో నాన్ అఫీషియల్ డైరెక్టర్గా బీజేపీ సీనియర్ నేత సయ్యద్ జాఫర్ ఉన్నారు. ఆయన కూడా తన పదవికి రాజీనామా చేయాల్సి ఉంది.