ప్రస్తుతం ఆటో గేర్, ఎలక్ట్రానిక్ వాహనాల తయారీపైనే ఆటోమొబైల్ సంస్థలు ఎక్కువగా దృష్టి పెట్టాయి. కొత్తగా తయారయ్యే కార్లల్లో వైపర్లు పని చేయాలన్నా కూడా చిప్ అవసరమే. కార్ల తయారీలో ఎలక్ట్రానిక్ సర్క్యూట్ల వినియోగం పూర్తిగా చిప్లతోనే ముడి పడి ఉంది. దీంతో చిప్లకు ప్రస్తుతం డిమాండ్ భారీగా పెరిగింది. ప్రపంచ వ్యాప్తంగా చిప్ తయారీ సంస్థలు ప్రస్తుతం హాంకాంగ్, చైనాలో మాత్రమే ఉన్నాయి. అయితే కరోనా కారణంగా చిప్ల తయారీకి బ్రేక్ పడింది. ఇండియాలో చిప్ తయారీ యూనిట్లు పెద్దగా లేవు. దాదాపు పెద్ద సంస్థలన్నీ కూడా వీటిని దిగుమతి చేసుకుంటున్నాయి. ఇందుకోసం పెద్ద ఎత్తున విదేశీ మారక ద్రవ్యం కూడా ఖర్చు చేస్తున్నాయి. ప్రతి ఏటా దాదాపు 3 లక్షల కోట్ల రూపాయల విలువైన చిప్లను భారత్ దిగుమతి చేసుకుంటోంది. వీటి కొరతను అధిగమించేందుకు ఇప్పుటు టాటా సన్స్ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ఆటోమొబైల్ రంగంలో టాప్ ప్లేస్లో ఉన్న టాటా గ్రూప్... ఏకంగా 300 మిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టేందుకు రెడీ అయ్యింది. ఈ ప్లాంట్ కోసం ఇప్పటికే దక్షిణాది రాష్ట్రాలతో సంప్రదింపులు కూడా జరుపుతున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం ఆటో గేర్, ఎలక్ట్రానిక్ వాహనాల తయారీపైనే ఆటోమొబైల్ సంస్థలు ఎక్కువగా దృష్టి పెట్టాయి. కొత్తగా తయారయ్యే కార్లల్లో వైపర్లు పని చేయాలన్నా కూడా చిప్ అవసరమే. కార్ల తయారీలో ఎలక్ట్రానిక్ సర్క్యూట్ల వినియోగం పూర్తిగా చిప్లతోనే ముడి పడి ఉంది. దీంతో చిప్లకు ప్రస్తుతం డిమాండ్ భారీగా పెరిగింది. ప్రపంచ వ్యాప్తంగా చిప్ తయారీ సంస్థలు ప్రస్తుతం హాంకాంగ్, చైనాలో మాత్రమే ఉన్నాయి. అయితే కరోనా కారణంగా చిప్ల తయారీకి బ్రేక్ పడింది. ఇండియాలో చిప్ తయారీ యూనిట్లు పెద్దగా లేవు. దాదాపు పెద్ద సంస్థలన్నీ కూడా వీటిని దిగుమతి చేసుకుంటున్నాయి. ఇందుకోసం పెద్ద ఎత్తున విదేశీ మారక ద్రవ్యం కూడా ఖర్చు చేస్తున్నాయి. ప్రతి ఏటా దాదాపు 3 లక్షల కోట్ల రూపాయల విలువైన చిప్లను భారత్ దిగుమతి చేసుకుంటోంది. వీటి కొరతను అధిగమించేందుకు ఇప్పుటు టాటా సన్స్ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ఆటోమొబైల్ రంగంలో టాప్ ప్లేస్లో ఉన్న టాటా గ్రూప్... ఏకంగా 300 మిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టేందుకు రెడీ అయ్యింది. ఈ ప్లాంట్ కోసం ఇప్పటికే దక్షిణాది రాష్ట్రాలతో సంప్రదింపులు కూడా జరుపుతున్నట్లు తెలుస్తోంది.