ఇక అప్పులు వసూలు చేయడానికి కొన్ని బ్యాంకులు/ఆర్థిక సంస్థలు వేధించడం ఇంకా అలాగే బెదిరించడం వంటి పద్ధతులను వాడటంపై ఆర్బీఐ చాలా తీవ్రంగా స్పందించింది.కస్టమర్లను కనుక వేధిస్తే ఖచ్చితంగా కఠిన చర్యలు తప్పవని రిజర్వ్‌ బ్యాంక్‌ గవర్నర్ శక్తికాంత దాస్ స్పష్టం చేశారు. ఎప్పుడుపడితే అప్పుడు వాళ్లకి ఫోన్ చేసి అప్పు కట్టాలని అడగడం ఇంకా ఎలా పడితే అలా ఇష్టం వచ్చినట్లు బూతులు మాట్లాడటం వంటి పద్ధతులను సహించబోమని అన్నారు.అలాగే ఇలాంటి వాటిని అడ్డుకోవడానికి అన్ని చర్యలూ కూడా ఖచ్చితంగా తీసుకుంటున్నామని చెప్పారు. ''ఇక అర్థరాత్రి కూడా ఫోన్ చేసి అప్పుకట్టాలని అడుగుతున్నారంటూ లోన్ రికవరీ ఏజెంట్లపై కంప్లైంట్లు ఎక్కువగా అందుతున్నాయి.ఇంకా అలాగే తమకు ఇష్టం వచ్చినట్లుగా ఎలా పడితే అలా బూతులు మాట్లాడుతున్నారని సమాచారం వస్తోంది. ఇలాంటివి అసలు ఆమోదనీయం కాదు. ఫైనాన్షియల్ సంస్థలు ఇందుకు పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఇక రెగ్యులేటెడ్ సంస్థలపై అయితే నేరుగా మేం చర్యలు తీసుకుంటాం. అన్ రిజిస్టర్ సంస్థలపై పోలీసులు ఇంకా ఇతర ఏజెన్సీలు చర్యలు తీసుకుంటాయి'అని ఆయన అన్నారు. ఇంకా అలాగే లోన్ రికవరీ ఏజెంట్ల వేధింపులు భరించలేక కొందరు ఆత్మహత్యలు చేసుకున్న వార్తలు కూడా వచ్చిన నేపథ్యంలో ఆయన ఈ కామెంట్లు చేశారు.


ఇక కస్టమర్లను ఇలాంటి సమస్యల నుంచి రక్షించడానికి ప్రత్యేక కమిటీని కూడా ఏర్పాటు చేసింది.ఈ వేధింపులను అడ్డుకోవడానికి ఇది సిఫార్సులు చేయనుంది.డిజిటల్ ఫైనాన్షియల్ ప్రొడక్టులు ఇంకా అలాగే డిస్ట్రిబ్యూషన్పైనా ఫోకస్ చేస్తుంది. డిజిటల్ లెండింగ్పై డిస్కషన్ పేపర్ను కూడా విడుదల చేయనుంది. టెక్నాలజీ ఇంకా అలాగే డిజిటల్ సర్వీసుల వాడకం ఎక్కువై సైబర్ నేరాలు పెరగడంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఈ విషయమై ఆర్బీఐ వర్కింగ్ గ్రూప్ కొన్ని సిఫార్సులు చేసిందని ఇంకా అవి పరిశీలనలో ఉన్నాయని కూడా శక్తికాంత దాస్ తెలిపారు. ఇల్లీగల్గా అప్పులు ఇస్తున్న మొత్తం 600 యాప్స్ను కూడా గుర్తించిందని, ఇక వీటిపై సంబంధిత ఏజెన్సీలు చర్యలు తీసుకుంటాయని కూడా ఆయన వివరించారు. ఇట్లాంటి యాప్స్ నుంచి ఎవరైనా అప్పులు తీసుకునేముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలని సూచించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

RBI