ఇక కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన గైడ్‌లైన్స్ ఉల్లంఘించేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (CCPA) తాజాగా ఆదేశాలు జారీ చేసింది. కొత్త మార్గదర్శకాలపై విస్తృత ప్రచారాన్ని కల్పించాలని ఇంకా వినియోగదారుల ప్రయోజనాలను పరిరక్షించడం కోసం నిబంధనల్ని ఉల్లంఘించిన వారిపై తగిన చర్యలు తీసుకోవాలని అన్ని రాష్ట్రాలు ఇంకా అలాగే కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన సెక్రెటరీస్‌కు CCPA లేఖ రాసింది. జిల్లా కలెక్టర్లు ఫిర్యాదును స్వీకరించిన తర్వాత మొత్తం 15 రోజుల్లో సీసీపీఏకు రిపోర్ట్ సబ్మిట్ చేయాలని ఆదేశించింది.హోటళ్లు ఇంకా రెస్టారెంట్లు ఆటోమేటిక్‌గా సర్వీస్ ఛార్జీలు విధించకుండా లేదా ఆహార బిల్లులలో డిఫాల్ట్‌గా సర్వీస్ ఛార్జీ యాడ్ చేయకుండా CCPA కొత్త మార్గదర్శకాలు రూపొందించిన సంగతి కూడా తెలిసిందే. ఈ మార్గదర్శకాలను ఉల్లంఘిస్తే వినియోగదారులు ఎలాంటి చర్యలు తీసుకోవచ్చో కూడా స్పష్టంగా పేర్కొంది.ఈ కొత్త మార్గదర్శకాలు సలహా కాదని, చట్టం ప్రకారం అమలు చేయదగినవని CCPA చీఫ్ కమిషనర్ నిధి ఖరే అన్నారు. వినియోగదారుల రక్షణ చట్టం ప్రకారం, 2019లోని సెక్షన్ 18(2)(ఎల్) ప్రకారం ఈ మార్గదర్శకాలు జారీ చేయబడ్డాయి.


ఈ అన్యాయమైన వాణిజ్య పద్ధతులను నిరోధించడానికి, వినియోగదారుల ప్రయోజనాలను పరిరక్షించడానికి అవసరమైన మార్గదర్శకాలను జారీ చేయడానికి CCPAకి అధికారం ఇస్తుందని కూడా ఆమె అన్నారు.ఇక మీరు కూడా ఏదైనా హోటల్ లేదా రెస్టారెంట్‌కు వెళ్తే, అక్కడ సర్వీస్ ఛార్జీ తప్పనిసరిగా చెల్లించాలని ఒత్తిడి చేస్తే నేషనల్ కన్స్యూమర్ హెల్ప్‌లైన్‌కు వెంటనే మీరు ఫిర్యాదు చేయొచ్చు. దానికి 1915 నెంబర్‌కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలి. లేదా నేషనల్ కన్స్యూమర్ హెల్ప్‌లైన్ మొబైల్ యాప్‌లో అయిన ఫిర్యాదు చేయాలి. ఇంకా అలాగే వినియోగదారులు కన్స్యూమర్ కమిషన్‌లో కూడా కంప్లైంట్ చేయొచ్చు. ఇ-డాఖిల్ పోర్టల్ అయిన https://www.edaakhil.nic.in/ లో సులువుగా కంప్లైంట్ ని సబ్మిట్ చేయొచ్చు. ఇక సంబంధిత జిల్లా కలెక్టర్‌కు కూడా నేరుగా ఫిర్యాదు అనేది చేయొచ్చు. లేదా సీసీపీఏ ఇమెయిల్ ఐడీకి com-ccpa@nic.in ఫిర్యాదును  కూడా పంపొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: