ఇక ఈ ఏడాది పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి కింద కేంద్ర ప్రభుత్వం అందజేసే రూ.2వేల చొప్పున ఏటా రూ.6వేలు డబ్బులు జమ కావాలంటే రైతులు తప్పనిసరిగా ఈ-కేవైసీ చేయించుకోవాలి. ఈ నెల 31వ తేదీలోపు ఈ-కేవైసీ అనేది చేయించుకోకపోతే పథకం లబ్ధిని కోల్పోయే ప్రమాదం ఉంది.ఈ-కేవైసీ ఇంకా కేవైసీ (నో యువర్‌ కస్టమర్‌) రెండు విధానాలు వేర్వేరు. ఇక ఓటీపీ ఆధారంగా చేసే విధానాన్ని ఈ-కేవైసీ అంటారు.ఆధార్‌ రిజిస్టర్‌ అయిన మొబైల్‌ నంబర్‌కు ఓటీపీ అనేది వస్తుంది. ఇక ఈ ఓటీపీతో ఈ-కేవైసీని పూర్తి చేస్తారు.ఇంకా అలాగే కేవైసీని డాక్యుమెంట్ల ఆధారంగా పూర్తి చేస్తారు. ఇంతకు మునుపు కేవైసీ చేయించిన పీఎం కిసాన్‌ లబ్ధిదారులు మళ్లీ ఈ-కేవైసీ చేయించుకోవాలని అధికారులు ఖచ్చితంగా సూచిస్తున్నారు. ఆర్‌బీఐ ఆదేశాల మేరకు మనీ ల్యాండరింగ్ ఇంకా ఫేక్‌ అకౌంట్లను అరికట్టేందుకు ఈ-కేవైసీ విధానాన్ని అమలు చేస్తున్నారు. ఈ విధానం వల్ల అనర్హులకు సంక్షేమ పథకాలు అనేవి నిలిచిపోతాయి.


దీంతో ఇక ప్రజాధనం ఆదా అవుతోంది.మీకు స్మార్ట్‌ఫోన్‌ ఉంటే ఇంట్లోనే ఈ-కేవైసీని అప్‌డేట్‌ చేసుకోవచ్చు. ముందుగా మీరు www.pmkisan.gov.in వెబ్‌సైట్‌లోకి వెళ్లి ఆధార్‌ నంబర్‌ నమోదు చేసుకోవాలి. అప్పుడు ఆధార్‌కార్డుకు లింకై ఉన్న మొబైల్‌ ఫోన్‌కు ఓటీపీ అనేది వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్‌ చేయగానే గెట్‌ పీఎం కిసాన్‌ ఓటీపీ ఆప్షన్‌పై క్లిక్‌ చేయాలి. మళ్లీ ఫోన్‌కు వచ్చిన ఓటీపీని నమోదు చేసి సబ్మిట్‌ చేస్తే ఈ ఈ-కేవైసీ అప్‌డేట్‌ అవుతుంది.పీఎం కిసాన్‌ సమ్మాన్‌ పథకం కింద రూ.2 వేలు చొప్పున ఏటా మూడు విడతల్లో రూ.6 వేలు డబ్బు లబ్ధి చేకూరుతుంది. అర్హత ఉన్న ప్రతి రైతూ ఆధార్, దానికి అనుసంధానమైన ఫోన్‌ నెంబరు, ఇంకా అలాగే ఓటీపీ నెంబరు ఆధారంగా అథెంటిఫికేషన్‌ చేసుకోవాలి.కాబట్టి రైతులు ఈ విషయాన్ని గమనించి సాధ్యమైనంత తొందరగా ఈకేవైసీ చేయించుకోవాలి. ఇక ఇదే చివరి అవకాశం.. ఈ అవకాశాన్ని జారవిడుచుకోవద్దు.

మరింత సమాచారం తెలుసుకోండి: