ఇక కేంద్ర ప్రభుత్వం 8వ పే కమిషన్‌ను  ఏర్పాటు చేయనుందన్న ప్రచారం జరుగుతోంది.ఉద్యోగులకు, పెన్షనర్లకు వేతనాల సవరణ, అలవెన్సులు ఇంకా అలాగే పెన్షన్ల కోసం కొత్త కమిషన్ ఏర్పాటు కానుందన్నది ఆ ప్రచారం సారాంశం. ఇక దీనిపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. అలాంటి ప్రతిపాదన ఏదీ ప్రస్తుతం తమ పరిశీలనలో లేదని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అయిన పంకజ్ చౌదరీ రాజ్యసభకు తెలిపారు.కేంద్ర ప్రభుత్వం ఈ ఎనిమిదో సెంట్రల్ పే కమిషన్ ఏర్పాటు చేస్తుందన్న ప్రచారం నిజమేనా అన్న ప్రశ్నకు పంకజ్ చౌదరీ బదులు ఇచ్చారు. అయితే ఇక 7వ వేతన సంఘం సిఫార్సు ప్రకారం, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ఇచ్చే జీతాలు, అలవెన్సులు ఇంకా అలాగే పెన్షన్‌లను సమీక్షించడానికి మరొక పే కమిషన్‌ను ఏర్పాటు చేయవలసిన అవసరం లేదు.ఇక పదేళ్ల సుదీర్ఘ కాలం వరకు వేచి ఉండకుండా మ్యాట్రిక్స్‌ను కాలానుగుణంగా సమీక్షించవచ్చని ఏడో పే కమిషన్ ఛైర్మన్ సిఫార్సు చేసినట్టు పంకజ్ చౌదరీ రాజ్యసభకు తెలిపడం జరిగింది. ఇంకా సామాన్యుల బాస్కెట్‌లో ఉండే వస్తువుల ధరల్లో మార్పులను కూడా పరిగణనలోకి తీసుకుని Aykroyd ఫార్ములా ఆధారంగా పే మ్యాట్రిక్స్ సమీక్షించి  సవరించబడుతుదన్నారు.


అలాగే షిమ్లాలోని లేబర్ బ్యూరో దీని నిత్యం సమీక్షిస్తున్నట్టు తెలిపారు.ఇంకా అలాగే మరొక పే కమీషన్ కోసం ఎదురుచూడకుండా కాలానుగుణంగా ఆ మ్యాట్రిక్స్‌ను సవరించడానికి ఇది ప్రాతిపదికగా ఉండాలని సూచించబడినట్టు తెలిపారు. అధిక WPI ద్రవ్యోల్బణం దృష్ట్యా ప్రభుత్వం డియర్‌నెస్ అలవెన్స్ ఇంకా డియర్‌నెస్ రిలీఫ్ రేట్లను పెంచుతుందా అనే దానిపై మరొక ప్రశ్నకు ప్రతిస్పందిస్తూ, సిమ్లాలోని లేబర్ బ్యూరో అందించిన AICPI-IW డేటా ఆధారంగా డీఏ ఇంకా డీఆర్ నిర్ణయిస్తామని తెలిపారు.ఇక కేంద్ర ప్రభుత్వం ప్రతీ ఏటా కూడా రెండుసార్లు ఉద్యోగులకు డీఏ ఇంకా పెన్షనర్లకు డీఆర్ పెంచుతుంది. జనవరిలో ఓసారి, జూలై నెలలో మరోసారి డీఏ పెరుగుతుంది. ఇప్పటికే జనవరికి సంబంధించిన డీఏ ఇంకా డీఆర్ పెరిగింది. జూలై 1వ తేదీన డీఏ పెరుగుతుందని ఉద్యోగులు, పెన్షనర్లు ఎదురుచూశారు. కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి ఇంకా ప్రకటన అనేది రాలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: